మైత్రీ నిర్మాతల స్ట్రాంగ్ డెసిషన్!!
on Nov 28, 2018
`శ్రీమంతుడు`, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి , మోహన్ చెరుకూరి. ఈ మూడు సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకున్న ఈ నిర్మాతలు నాగచైతన్య నటించిన `సవ్యసాచి` , రవితేజ నటించిన `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రాలతో అట్టర్ ఫ్లాప్ లు చవి చూసారు. దీంతో ప్రస్తుతం మైత్రీ నిర్మాతల మైండ్ సెట్ మారిందంట. ప్రజంట్ నిర్మాణంలో ఉన్న `డియర్ కామ్రేడ్`, చిత్రలహరి` చిత్రాల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారట. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ ని ఓకే చేసి , వాటిని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే గత రెండు సినిమాల రిజల్ట్ ఈ నిర్మాతలను ఆలోచనలో పడేసిందని తెలుస్తోంది. కొంత మంది దర్శకులు చెప్పిన స్టోరీలను మరోసారి చెక్ చేసుకుంటున్నారట. కొన్నింటిని అయితే డ్రాప్ అయిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక మీదట వచ్చే సినిమాలు తమ బేనర్ క్రేజ్ పెంచేలా ఉండాలన్న స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట.