ఫుల్ స్వింగులో... మిస్టర్ మజ్ను
on Nov 28, 2018
జనవరిలో 'మిస్టర్ మజ్ను' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చివరి నిమిషంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా నెల రోజుల ముందే షూటింగుకు ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'మిస్టర్ మజ్ను'. ఇందులో 'సవ్యసాచి' ఫేమ్ నిధీ అగర్వాల్ కథానాయిక. వరుణ్తేజ్ 'తొలిప్రేమ' విజయం తరవాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అఖిల్ బుధవారం ఉదయం ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. "ప్యాచ్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతుంది. ఓ పాట మినహా డిసెంబర్ 3 కల్లా షూటింగ్ అంతా పూర్తవుతుంది. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం" అని అఖిల్ ట్వీట్ చేశారు. మిగిలిన ఒక్క పాట కోసం హైదరాబాద్లో స్పెషల్ సెట్ వేస్తారట. తొలి రెండు సినిమాల్లో అఖిల్ ఎక్కువగా యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో మాత్రం లవ్ అండ్ రొమాన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారట.