పైరసీ చేస్తే వాసిపోద్ది!!
on Feb 9, 2019
సినిమా చిన్ననా, పెద్దదా అని కాదు ఏ సినిమా అయినా కానీ ఇటీవల పైరసీ కి గురి కావడం సర్వసాధారమై పోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పైరసీ వాళ్లు మాత్రం రిలీజైన కొద్ది సేపట్లోనే సినిమాను సైట్లలో పెడుతున్నారు. ఇక ఈ మధ్య అయితే సవాల్ చేస్తూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఈ సమస్య 2.0 చిత్రం ఎదుర్కొంది. పైరసీ భూతం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. ఇక సమస్య నుంచి కాస్త ఊరట కలిగించేలా కేంద్రం పైరసీ పై కొన్ని చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర కేబినెట్ ఓ సంచలన మైన తీర్పునిచ్చింది. ఇక పై సినిమాకు చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుతం ఆమోదాన్ని తెలిపింది. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే మూడేళ్ల కారాగార శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా కట్టే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయం పై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన పైరసీ బెడద తగ్గుతుందేమో చూద్దాం మరి.