ఫస్ట్ డే 31 పర్సెంట్ షేర్ రాబట్టిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'
on Oct 16, 2021
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' (ఎంఈబీ) అక్టోబర్ 15న దసరా పర్వదినం రోజు విడుదలై, పాజిటివ్ టాక్తో సక్సెస్ దిశగా పరుగులు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజే 31 శాతం షేర్ రాబట్టి బయ్యర్ల ముఖాల్లో ఆనందాన్ని నింపింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ చేసిన 'ఎంఈబీ' రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 5.45 కోట్ల షేర్ రాబట్టడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లలో 4 ఆటలకు పర్మిషన్ లభించడం, 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతించడం, టికెట్ ధరలను పెంచడంతో అక్కడ కూడా మంచి వసూళ్లను 'ఎంఈబీ' నమోదు చేసింది.
ఆంధ్ర, తెలంగాణలో ఈ సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రూ. 17.5 కోట్లని అంచనా. అంటే 31 శాతం షేర్ వచ్చేసిందన్న మాట. ఓవర్సీస్లోనూ ఈ సినిమా సునాయాసంగా బ్రేకీవెన్ సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్ అందిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. హర్ష, విభ పాత్రల్లో అఖిల్, పూజా రాణించిన విధానం, ముఖ్యంగా పూజ స్క్రీన్ ప్రెజెన్స్, స్టాండప్ కమెడియన్గా ఆమె చేసిన పర్ఫార్మెన్స్కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అఖిల్ సైతం నటుడిగా మెప్పించి, తాను స్టార్ మెటీరియల్నని నిరూపించుకున్నాడు. వైవాహిక బంధం గట్టిగా ఉండాలంటే ఏం కావాలనే పాయింట్తో బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా కనెక్టవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఏరియా వారీగా ఫస్ట్ డే ఎంఈబీ కలెక్షన్స్...
తెలంగాణ: రూ. 2.02 కోట్లు
ఆంధ్ర: రూ. 2.31 కోట్లు
రాయలసీమ: రూ. 1.12 కోట్లు
మొత్తం - రూ. 5.45 కోట్లు
Also Read