క్రికెటర్గా అగ్ర కథానాయకి..!
on Sep 29, 2017
మహానటి సావిత్రి బయోపిక్ లో నటిస్త్తున్న టాలీవుడ్ టాప్ కథానాయకి మరో బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తుంది.ఆమె ఎవరో కాదు విభిన్నమైన పాత్రలకు జీవం పొసే అగ్ర కథానాయకి సమంత. ఆమె ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటించేందుకు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే భారతీయ చలన చిత్ర పరిశ్రమలో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు వరస కట్టాయి. ఆ క్రమంలో మరో కొత్త సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రంగం సిద్ధం చేసింది. తెలుగు తమిళ భాషలలో నటించేందుకు సమంత ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. క్రికెటర్ గా ఎలా ఆడబోతుందనేది ఆసక్తిని కలిగిస్తుంది. ఎన్నో పాత్రలకు అద్దినట్లుగా చేసే సమంత కొత్త రూపం లో సందడి చేయడం ఖాయమని తెలుస్తుంది. ఈ సినిమా చైతు తో పెళ్లి జరిగాక నటించే తొలి చిత్రంగా నిలవనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మహిళా క్రీడాకారులకు క్రికెట్ పట్ల ఆసక్తిని మరింతగా కలిగించనున్నది.