'మేక సూరి' దర్శకుడికి సినిమా ఆఫర్!
on Aug 5, 2020
ఇటీవల 'జీ 5' ఓటీటీలో విడుదలైన ఒరిజినల్ మూవీ 'మేక సూరి' దర్శకుడు త్రినాథ్ వెలిసెలకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది. త్వరలో ఆ సినిమా స్టార్ట్ చేయనున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన 'నాదీ నీదీ ఒకే కథ' చిత్రనిర్మాతలలో ఒకరైన అట్లూరి నారాయణరావు సంస్థకు అతనో సినిమా చేయనున్నారు. రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా 'మేక సూరి'ని తెరకెక్కించిన విధానం నచ్చిన అట్లూరి, దర్శకుడు త్రినాథ్కి అవకాశం ఇచ్చారట.
"న్యూ-ఏజ్ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీయాలని అనుకుంటున్నాం. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. స్టార్ హీరోతో సినిమా చేస్తాం. ఇండియాలో అందమైన లొకేషన్లలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్" అని త్రినాథ్ వెలిసెల అన్నారు.
సినిమా కంటే ముందు 'మేక సూరి' పార్ట్ 2 విడుదల కానుంది. ఆల్మోస్ట్ పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలో బాలన్స్ పార్ట్ కంప్లీట్ చేసి, రిలీజ్ చేయనున్నారు.