మెహబూబా ట్రైలర్ చూసి పూరీపై అఖిల్ ఫోకస్..?
on Feb 12, 2018
కొడుకులిద్దరిలో నాగచైతన్య హీరోగా గుర్తింపు తెచ్చుకుని.. పెళ్లి చేసుకుని లైఫ్లో సెట్ అయిపోయాడు.. రెండో కొడుకు అఖిల్ మాత్రం పర్సనల్గానూ.. ప్రొఫెషనల్గాను ఫెయిలవ్వడంతో నాగార్జునకు బెంగపట్టుకుంది. హీరోగా నిలబెట్టేందుకు చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. వినాయక్ సంగతి పక్కనబెడితే విక్రమ్ కుమార్ కూడా.. అఖిల్ను గట్టెక్కించలేకపోవడంతో నాగ్ బాగా డిజప్పాయింట్ అయ్యాడు. నెక్ట్స్ ఏ దర్శకుడి చేతిలో అఖిల్ను పెట్టాలో తెలియక నాగ్ తనలో తాను కుమిలిపోతున్నాడట. ఇలాంటి టైంలో రిలీజైన మెహబూబా ట్రైలర్ వచ్చింది.
పంచ్ డైలాగ్స్.. అటిట్యూడ్ చూపించే హీరోయిజం లేకుండా.. హై టెక్నికల్ స్టాండర్డ్స్తో కట్ చేసిన ట్రైలర్తో.. పూరీ ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇది చూసినవారికి తిరిగి పాత పూరీని చూసినట్లుందని చాలా మంది ప్రశంసించారు. ఈ టాక్ నాగ్ చెవిన పడటంతో.. ఆయనకు కొండంత ధైర్యం వచ్చింది. అఖిల్ తర్వాతి సినిమాకు పూరీనే కరెక్టని నాగ్ డిసైడయ్యారట. హీరోలను కొత్తగా చూపించడంలోనూ.. స్టైలిష్గా మేకోవర్ చేయడంలోనూ పూరీని మించిన వారు లేరు. అందుకే నాగ్... పూరీని ఎంచుకున్నాడని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. ఈ న్యూస్పై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందేనంటున్నారు విశ్లేషకులు.
Also Read