మోహన్ బాబు, మీనా.. మరోసారి?
on Feb 25, 2021
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన కనువిందు చేసిన నాయికల్లో మీనా ఒకరు. దాదాపు 30 ఏళ్ళ క్రితం వీరి కాంబినేషన్ లో వచ్చిన `అల్లరి మొగుడు` బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత ఈ ఇద్దరు `పుణ్యభూమి నా దేశం`, `మామ మంచు - అల్లుడు కంచు` చిత్రాల్లో కలిసి నటించారు. కట్ చేస్తే.. ఆరేళ్ళ విరామం అనంతరం వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మోహన్ బాబు ప్రధాన పాత్రలో `సన్ ఆఫ్ ఇండియా` పేరుతో ఓ సోషల్ మెసెజ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు అందిస్తున్నారు. కాగా, ఇందులో మోహన్ బాబుకి శ్రీమతి పాత్రలో మీనా దర్శనమివ్వనున్నారట. కథని కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని సమాచారం. త్వరలోనే `సన్ ఆఫ్ ఇండియా`లో మీనా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. మోహన్ బాబు ప్రీవియస్ వెంచర్ `సూరారై పోట్రు` ( తెలుగులో `ఆకాశం నీ హద్దురా`), మీనా గత చిత్రం `దృశ్యం 2` (మలయాళం) అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అయి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి.