రవితేజ-వక్కంతం సినిమాకు ఆయనే నిర్మాత!
on May 27, 2020
మాస్ మహారాజ్ రవితేజ, రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీది హిట్ కాంబినేషన్. ప్రేక్షకులకు కామెడీ కిక్ ఎలా ఉంటుందో, కామెడీ క్లిక్ అయితే నిర్మాతకు ప్రాఫిట్స్ కిక్ ఎలా ఉంటుందో, సక్సెస్ కిక్ ఎలా ఉంటుందో... 'కిక్' సినిమాతో ఇద్దరూ టేస్ట్ చేశారు. తర్వాత వచ్చిన 'కిక్ 2' ఆకట్టుకోలేదు. 'టచ్ చేసి చూడు' సరిగా ఆడలేదు. కానీ, వీళ్లిద్దరి కాంబినేషన్ మీద ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా పరిచయమైన వక్కంతం వంశీ, దర్శకుడిగా రెండో సినిమాను రవితేజతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల హీరోకి కథ చెప్పి, ఓకే చేయించుకున్నారు.
రవితేజ, వక్కంతం వంశీ కలిసి సినిమా చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారని సమాచారం. మరికొంత మంది నిర్మాతలు రెడీగా ఉన్నప్పటికీ, అనిల్ సుంకర అయితే బావుంటుందని ఆయనకు రవితేజ అవకాశం ఇచ్చారట. వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ కానుందని తెలుస్తోంది. సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో అనిల్ సుంకర విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read