ఇగో సహజం అంటోన్న మారుతి!!
on Sep 8, 2018
ఇగో అందరిలో ఉంటుంది.. మనతో పాటు మనలో ఇగో కూడా పెరుగుతుంటుంది. అది సహజం. మనకు కావాల్సినది దొరికితే ఎదుటి వ్యక్తి మాట వినం. అప్పుడు మనలో అహంకారం వచ్చేస్తుంది. ఫెయిల్యూర్స్ వస్తే తట్టుకోలేం. సమస్యలు అక్కడే ప్రారంభమవుతాయి అంటూ ఇగో పురాణం చెప్పుకొచ్చారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వస్తోన్న శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఈ నెల 13న వస్తోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ పె విధంగా స్పందించారు. ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ...` నేను తీసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ సినిమా. నాగచైతన్య నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆయనలో నాగార్జునాను చూశాను. అత్త, అల్లుడు ల మధ్య హోరా హోరీ గా ఉండే కథ కాదు. ఓ సాధారణ కుర్రాడు శైలజా రెడ్డికి ఎలా అల్లుడు అయ్యాడనేది కథ. అంతే కానీ రమ్యకృష్ణ గారు ఇందులో విలన్ కాదు. అల్లుడు బేస్ మీద వచ్చి సినిమాలు చాలా కాలమైంది. అందుకే ఈ సినిమా చేశాను. రెడ్డి అనేది పవర్ ఫుల్ గా ఉంటుందని శైలజా రెడ్డి టైటిల్ పెట్టాం.
డిజార్డర్స్ పై సినిమాలు చేస్తాను కొంత గ్యాప్ తీసుకుని. ఇక చిన్న సినిమాలు నిర్మించ దలచుకోలేదు. ఇటీవల చాలా చిత్రాలు నిరాశ పరిచాయి. గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ లో సినిమాలుంటాయి. మంజుల గారి బేనర్ లో కూడా ఒక సినిమా ఉటుంది. విజయ్ దేవరకొండతో చేసే ఆలోచన ఇద్దరికీ ఉంది. ఎప్పుడు కుదురుతుందో చూడాలి. అల్లరి నరేష్ సినిమా కూడా ఉంటుంది`` అన్నారు.