వేసవిలో మెలోడీబ్రహ్మ హవా
on Jan 27, 2021
ఇస్మార్ట్ శంకర్, రెడ్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ప్రస్తుతం ఈ వెటరన్ కంపోజర్ చేతిలో దాదాపు డజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో హై బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. అలాగే మీడియం, లో - బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి. కాగా, ఈ వేసవిలో నెల రోజుల వ్యవధిలో నాలుగు ఆసక్తికరమైన చిత్రాలతో సందడి చేయనున్నారు మణిశర్మ.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న ఆచార్య వేసవి కానుకగా మే నెలలో విడుదల కానుండగా.. దాని కంటే ముందు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో చేస్తున్న నారప్ప, యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో చేస్తున్న సీటీమార్ రాబోతున్నాయి. అలాగే సుప్రీమ్ హీరో సాయితేజ్ తో చేస్తున్న రిపబ్లిక్ కూడా సమ్మర్ లోనే రిలీజ్ కాబోతోంది. మరి.. డిఫరెంట్ జానర్స్ లో రూపొందుతున్న ఈ నాలుగు సినిమాలతో మణిశర్మకి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.