నంది అవార్డ్ పగ.. నాగ్ స్కెచ్ సూపరబ్బా..?
on Dec 4, 2017
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా, మేధావిగా అక్కినేని నాగార్జునకు పేరు. ఎవరిని ఎలా డీల్ చేయాలో.. కర్ర విరక్కుండా పాము చావకుండా ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో నాగ్ను చూసి నేర్చుకోవచ్చు అనేది ఫిలింనగర్ జనాలు తరచుగా అనుకునే మాట. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎంత దుమారం రేగింతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహానటుడు ఏఎన్నార్ సహా.. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మనం సినిమాకు అవార్డుల్లో అన్యాయం జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలోనూ.. మరికొంత మంది ప్రెస్మీట్లు పెట్టి మరి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
బాలయ్య-నాగ్ మధ్య ఉన్న మనస్పర్థల కారణంగానే మనంని కావాలనే పక్కనబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే నాగార్జున కానీ, అక్కినేని కుటుంబసభ్యులు కానీ ఎక్కడా దీనిపై స్పందించలేదు. కానీ ఎంతోకొంత డిస్పాయింట్ అయ్యుంటారన్నది వాస్తవం. నాగ్ తప్పకుండా దీనిపై ప్రతీకారం తీర్చుకుంటారని చాలా మంది భావించారు. మేధావులు అందిరిలా ఆవేశపడరు. తమ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తారని పెద్దలు అంటూ ఉంటారు.
అఖిల్-విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హలో థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్గా రిలీజైంది. ఈ ట్రైలర్ స్టార్టింగ్ టైంలో వేసిన కార్డ్స్పై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. బిగినింగ్లో "ఫ్రమ్ ద మేకర్స్" ఆఫ్ మనం అంటూ వేసిన కార్డ్ తర్వాత "మీ హృదయాలతో ఇచ్చిన అవార్డులు" అంటూ వచ్చిన కార్డ్ వైరల్ అవుతోంది. నంది అవార్డ్ రానుందుకే ఈ కార్డ్ ద్వారా నాగ్ తన కసిని తీర్చుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తను ఎవరు..? ఎందుకు..? రాజేశారో తెలియదు కానీ.. దీనిని చూసిన వారు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అంటూనే.. నాగ్ ఇంటెలిజెన్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారట.