మే 31న ప్రారంభం కానున్న 'సర్కార్ వారి పాట'
on May 27, 2020
సూపర్స్టార్ మహేశ్, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ మూవీకి 'సర్కార్ వారి పాట' టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇంకో విషయమేమంటే ఈ మూవీ మే 31 సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు లాంఛనంగా ప్రారంభం కానున్నది. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించడం కూడా దాదాపు ఖాయమేనని వినిపిస్తోంది. 'భరత్ అనే నేను'' సినిమాలో ఆ జంట చాలా బాగుందనే ప్రశంసలు వచ్చాయి. అందువల్ల మహేశ్ కూడా కియారా వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా గోపీసుందర్కు కాకుండా తమన్కు మహేశ్ ఓటేశాడంటున్నారు. అయితే పరశురామ్ మాత్రం గోపీసుందర్ అయితే తనకు బాగా ట్యూన్ అవుతాడనే ఉద్దేశంతో ఉన్నాడు. 'గీత గోవిందం' మూవీకి గోపీసుందర్ ఇచ్చిన ట్యూన్స్ ఆడియెన్స్ను ఎలా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక సినిమాటోగ్రాఫర్గా పి.ఎస్. వినోద్ ఎంపికయ్యాడు. 'అల.. వైకుంఠపురములో' మూవీకి ఆయన ఎలాంటి విజువల్స్ ఇచ్చాడో మనం చూశాం.
ఈ మధ్య కాలంలో మహేశ్ సినిమాలను రెండు మూడు బ్యానర్లు కలిసి నిర్మిస్తుండటం చూస్తున్నాం. అదే తరహాలో ఈ మూవీని కూడా మూడు బ్యానర్లు - మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ - కలిసి నిర్మించబోతున్నాయి. 'సర్కార్ వారి పాట'లో మాస్ టచ్ ఉండే రొమాంటిక్ క్యారెక్టర్ను మహేశ్ పోషించబోతున్నాడు.