ఈ ఏడాది చివరి వరకు అమెరికాలోనే మహేశ్?
on Sep 29, 2020
'సర్కారు వారి పాట' సినిమా చిత్రీకరణకు నవంబర్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు అమెరికా వెళ్లనున్నారు. అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. నవంబర్ నుండి ఈ ఇయర్ ఎండ్ వరకు మహేశ్ అమెరికాలోనే ఉంటారని టాక్. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా అగ్రరాజ్యంలోనే సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
పరశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. తొలిసారి ఈ దర్శకుడికి మహేశ్ అవకాశం ఇచ్చారు. బ్యాంకింగ్ నేపథ్యంలో అతడు మంచి కథ రాశారట. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ట్యూన్స్ ఫైనల్ చేశారు.
నవంబర్ మొదటివారంలో సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ మొదలు కానుంది. వాషింగ్టన్, ఫ్లోరిడా తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ చేయనున్నారు. అందుకు అవసరమైన అనుమతులను తీసుకునే పనిలో నిర్మాతలు ఉన్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు అక్కడే చిత్రీకరణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సినిమాలో మహేశ్ సరసన కథానాయికగా ఎవరు నటిస్తున్నది నిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోయినా, తాను మహేశ్ సరసన నటిస్తున్నట్లు కీర్తి సురేశ్ స్వయంగా వెల్లడించింది.
Also Read