అన్నయ్య రమేశ్కు మహేశ్ క్యూట్ బర్త్డే విషెస్
on Oct 13, 2020
ఎవరి జీవితంలోనైనా బర్త్డేస్ అనేవి చాలా ప్రత్యేకమైనవి. మన పుట్టినరోజును చాలా ఉత్సాహంగా జరుపుకుంటుంటాం. కొంతమంది అర్ధరాత్రి తేదీ మారగానే ఆత్మీయుల మధ్య కేక్ కట్చేసి, సంతోషాన్ని పొందుతారు. బర్త్డేని మెమరబుల్ డేగా మార్చుకోవడానికి ఎక్కువమంది తాపత్రయపడుతుంటారనేది నిజం. సూపర్స్టార్ మహేశ్బాబుకు అన్నయ్య రమేశ్బాబు అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమను చిన్నతనం నుంచీ అతను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. మహేశ్ కంటే ముందు బాలనటుడిగా, తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన రమేశ్.. తర్వాత నటనకు స్వస్తిచెప్పి నిర్మాతగా మారి కొన్ని చిత్రాలు నిర్మించారు. అన్నయ్య హీరోగా నటించిన 'బజారు రౌడీ', 'ముగ్గురు కొడుకులు' సినిమాల్లో మహేశ్ చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించాడు.
అక్టోబర్ 13 రమేశ్ బర్త్డే. ఈ సందర్భంగా ఒక అందమైన, భావోద్వేగపూరితమైన బర్త్డే విషెస్ను అన్నయ్యకు తెలిపాడు మహేశ్. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 'ముగ్గురు కొడుకులు' సినిమాకు సంబంధించిన రెండు స్టిల్స్ను అతను షేర్ చేసుకున్నాడు. ఒక దానిలో కృష్ణ, రమేశ్, మహేశ్ ఉండగా, మరో దానిలో రమేశ్, మహేశ్ ఉన్నారు. "మా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను నేర్చుకున్నదానిలో ఓ భాగం ఆయన నుంచి వచ్చినదేనని ఈజీగా చెప్పగలను. డిసిప్లిన్, డెటికేషన్, పాషన్ అనేవి నిస్వార్థంగా నాలో ప్రవేశపెట్టాడు. నువ్వెప్పుడూ గొప్ప ఆరోగ్యంతో, చాలా సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నా." అని రాసుకొచ్చాడు మహేశ్.
కృష్ణకు అమితమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన 'అల్లూరి సీతారామరాజు'లో ఆయన చిన్నప్పటి క్యారెక్టర్ చేయడం ద్వారా బాలనటుడిగా అడుగుపెట్టిన రమేశ్, ఐదారు సినిమాల తర్వాత 'సమ్రాట్' మూవీతో హీరోగా పరిచయమయ్యారు. చివరగా ఎన్. శంకర్ డైరెక్ట్ చేసిన 'ఎన్కౌంటర్' (1997) మూవీలో నటించారు. నిర్మాతగా మారి మహేశ్ హీరోగా నటించిన 'అర్జున్', 'అతిథి' చిత్రాలను నిర్మించి, 'దూకుడు', 'ఆగడు' చిత్రాలకు సమర్పకునిగా వ్యవహరించారు.
Also Read