త్రివిక్రమ్ వల్ల అజ్ఞాతవాసికి పడిన శిక్ష ఖరీదు..?
on Jan 5, 2018
సినిమా కథలు వూరకే పుట్టుకురావు.. ఒక కథను తయారు చేయడానికి రచయితలు చేసే గ్రౌండ్వర్క్ మామూలుగా ఉండదు. చుట్టూ జరిగే సంఘటనలు కావొచ్చు.. పాత సినిమాలు కావొచ్చు.. వాళ్లకి కావాల్సింది అందమైన కథ అల్లడానికి కావాల్సిన చిన్న పాయింట్. కథలు తయారు చేసే క్రమంలో సినిమా కథలనో, నవలను చదవడం.. అదే తరహా క్యారెక్టరైజేషన్ కారణంగా రచయితలు చిక్కుల్లో పడ్డ సంఘటనలు ఎన్నో. ఇప్పుడు తాజాగా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సరిగ్గా ఇదే సమయంలో ఆ కథ నాదేనంటూ ఒకాయన బయటకి వచ్చాడు. అది కూడా మన ప్రాంతం నుంచి కాదు. ఫ్రాన్స్ నుంచి.. తాను డైరెక్ట్ చేసిన లార్గోవించ్ మూవీని కాపీ కొట్టి త్రివిక్రమ్ అజ్ఞాతవాసిని తీశారని.. ఆ చిత్ర దర్శకుడు జెరొమ్ సల్లే సోషల్ మీడియాలో ఆరోపించాడు. ఇక తమ అనుమతి లేకుండా కథను ఎలా తీసుకుంటారు అంటూ.. లార్గోవించ్ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న టీ. సిరీస్ సంస్థ.. గ్రాస్ సేల్స్లో 10 శాతం తమకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అజ్ఞాతవాసి నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిందట. అంటే దాదాపు రూ. 15 కోట్లు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న వేళ ఇబ్బందులు దేనికని భావించిన హారికా హాసిని క్రియేషన్స్.. సొమ్ము చెల్లించేందుకు సిద్ధపడిందట.
అయితే అడిగినంత కాకుండా 5 కోట్ల వరకు ఓకే అన్నట్లు టీ. సిరీస్తో డిస్కస్ చేస్తోందట. ఇబ్బంది తన వల్లే వచ్చింది కాబట్టి.. ఆ మొత్తాన్ని తన రెమ్యూనరేషన్ లోంచి కట్ చేసుకోమని నిర్మాతతో త్రివిక్రమ్ అన్నట్లు ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు. ఈ వివాదానికి తెరపడుతుందా..? లేక తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించాలని టీ.సిరీస్ కండిషన్ పెడుతుందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.