`లక్ష్మీస్`కు లైన్ క్లియర్ అవుతోంది!!
on Mar 26, 2019
మొత్తానికి `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమాను ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలన్న వర్మ పంతం నెగ్గేలాగనే కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ అయిపోతున్నాయి. ఇటీవలే ఈ సినిమాపై ఈసీకు ఫిర్యాదు చేసిన క్రమంలో సినిమా చూసిన తరువాత యాక్షన్ తీసుకునే రైట్ ఈసీకి ఉంటుందని ఈసీవో చెప్పడంతో ఆ ప్రాబ్లమ్ అయిపోయిందనుకున్నారు. ఆ తర్వాత సెన్సార్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా క్లియరైపోయింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు క్లీన్ `యూ` సర్టిఫికెట్ ను ఇచ్చింది. దీంతో మార్చి 29 వ తేదీనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.
కాగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ
నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీ తేజ్ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ నటిస్తున్నాడు.
మరి రిలీజ్ ముందే ఇంత రచ్చ జరిగితే రిలీజ్ తర్వాత టీడీపీ పార్టీ వాళ్లు ఇంకెంత రచ్చ చేస్తారో. వాళ్లని వర్మ ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం.