బాసు.. 'మాసు'ను వదలడా ?
on Jan 9, 2017
మెగాస్టార్ చిరంజీవి నుండి వైవిధ్యమైన సినిమాలను ఆశిస్తున్న ప్రేక్షకులకు ఇది నిరాశ పరిచే విషయమే. మెగాస్టార్ మారడం లేదు. మాస్ జపం వదలడం లేదు. ఇకపై కూడా తన నుండి పక్కా మాస్ మసాలా సినిమాలే వస్తాయని చెబుతున్నారు చిరంజీవి. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెర ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. మరి కొద్ది గంటల్లో ఆయన ఖైధీ నెంబర్ 150 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలపై కూడా క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీనులను లైన్ లో పెట్టారు చిరు. ఇందులో సురేందర్ రెడ్డి సినిమా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళుతోంది. దీనికి చరణ్ నిర్మాత. తర్వాత బోయపాటి చిత్రం వుటుంది. ఈ రెండు సినిమాలు మెగాస్టార్ అంటే ఊగిపోయే మాస్ ఆడియన్స్ అభిరుచికి తగ్గటే పక్కా మాస్ మసాలా చిత్రాలుగా వుంటాయని చెబుతున్నారు చిరు.
తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు చిరు. రీఎంట్రీ సినిమాతో అభిమానులు తృప్తి పరచాలి కాబట్టి సేఫ్ గా ఓ హిట్ కధను కొనుక్కుని అందులో అదనంగా అన్నీ మసాలాలు కలపి ఓ ''కమర్షియల్ పాకం'' తయారుచేయడాన్ని సమర్ధించవచ్చు. అయితే దిని తర్వాత కూడా ఇదే తరహా మాస్ మసాలా చిత్రాలు చేయడానికి ఆయన మొగ్గుచూపడం ఒక్కింత అలోచించాల్సిన విషయమే. ఇప్పుడు సినిమా చూసే ప్రేక్షకుల అభిరుచి మారింది. ఈ తొమ్మిదేళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. మెగాస్టార్ సమకాలికులు వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. దంగల్ సినిమాలో బాన పొట్టతో నలుగురు ఆడపిల్లలకు తండ్రిగా కనిపించి యావత్ సినీ ప్రపంచంతో శభాష్ అనిపించుకున్నారు అమీర్ ఖాన్. ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ గురించి చెప్పకర్లేదు. సూక్ష్మం గ్రహించి సోలో హీరోగా చేస్తూనే డీగ్లామరైజ్డ్ పాత్రలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన మెగా నటుడిగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు.
మెగాస్టార్ విషయానికి వస్తే.. నవరసాలను అలోవకగా పడించే గొప్ప నటుడాయన. ఇప్పుడు రీఎంట్రీలో మెగాస్టార్ నుండి వివిధ్యమైన చిత్రాలు, ప్రయోగాలు వస్తాయిని ఆశించారంత. అయితే ఆయన మాత్రం మాస్ జపం వదిలేదిలేదని చెబుతున్నారు. సో.. ప్రేక్షకులు మెగాస్టార్ ని మళ్ళీ మాస్ మూసలో చూడాల్సిందేనన్నమాట.
Also Read