వదినమ్మ మాట మన్నిస్తాడా..?
on Jan 7, 2017
ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలతో పాటు మెగా అభిమానులు ఒక విషయంలో తలలు పట్టుకుంటున్నారు. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెం.150 ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్ను మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్లో నిర్వహించేందుకు చిత్రయూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అతిరథ మహారథులకు ఆహ్వానాలు అందాయి..సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో మెగాఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది..ఈ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాయ్ల్యాండ్కు తరలిరానుంది..
కానీ ఒకరి విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు..ఆయన ఎవరో ఈపాటికే మీకు అర్థమైపోయుంటుంది..ఆయనే పవన్కళ్యాణ్. పవర్స్టార్ వ్యక్తిగత కారణాలతో ఈ ఫంక్షన్కు రావడం లేదని అల్లు అరవింద్ ఓ సారి చెప్పగా..ఆ తర్వాత పవన్ "రావడం..రాకపోవడం అనేది ఆయన ఇష్టం"..అని చెర్రీ బాంబు పేల్చడంతో పవన్ ఖచ్చితంగా ఫంక్షన్కు హాజరుకారని ఊహాగానాలు బయలుదేరాయి..దీంతో చిరు భార్య సురేఖ రంగంలోకి దిగి పవన్ని స్వయంగా ఇంటికెళ్లి మరీ ఆహ్వానించారట..వదిన సురేఖ తన కన్నతల్లితో సమానమని పవన్ చాలా వేదికలపై చెప్పాడు..ఈ నేపథ్యంలో వదినమ్మ మాటకు కట్టుబడి పవర్స్టార్ తప్పకుండా ఫంక్షన్కు వస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.