ప్రభాస్ను మరోసారి కలిసిన 'కేజీఎఫ్' డైరెక్టర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాహుబలి?
on Nov 28, 2020
ఇప్పటికే మూడు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ అయిపోయిన బాహుబలి ప్రభాస్, మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నడ యాక్షన్ డ్రామ్ కేజీఎఫ్తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఆయన కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ను ప్రశాంత్ నీల్ కలిసి, స్క్రిప్ట్ గురించి చర్చించినట్లు అంతర్గత వర్గాలు తెలిపాయి. గతంలోనూ ఆ ఇద్దరూ ఓసారి కలిసి మాట్లాడుకున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దాని షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంలోనే ప్రభాస్ను ఆయన కలిసినట్లు సమాచారం. 'కేజీఎఫ్ 2' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రశాంత్. అయితే 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న తారక్, దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఆ తర్వాతే అతను ప్రశాంత్తో పనిచేయడానికి వీలుంది. అందుకే ఈ మధ్యలో ప్రభాస్తో సినిమా తీయాలని ప్రశాంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రభాస్ పీరియడ్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్' షూటింగ్ను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఆ వెంటనే ఓం రౌత్ డైరెక్షన్లో పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.
Also Read