రాజకీయ నాయకుడి కొడుకుతో కీర్తి పెళ్లి?
on Apr 4, 2020
ఇవాళ దక్షిణ భారత చిత్రసీమలోని టాప్ హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. నటిగా మారిన స్వల్ప కాలంలోనే మహానటి చిత్రంలో సావిత్రిగా అపూర్వంగా అభినయించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ పొందిన ఖ్యాతి ఆమె సొంతం. ఆమె చేతినిండా ఇవాళ పలు ఆసక్తికర చిత్రాలున్నాయి. తెలుగులో 'మిస్ ఇండియా', 'రంగ్ దే', 'గుడ్లక్ సఖి' సినిమాలు, తమిళంలో 'అన్నాత్తే', 'పెంగ్విన్', మలయాళంలో 'మరక్కర్ అరబికడలింతే సింహం' తదితర చిత్రాలు చేస్తోంది. మహేశ్ తర్వాతి సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో కీర్తి పెళ్లి కుదిరిందంటూ కోలీవుడ్లో అనూహ్యంగా ప్రచారం మొదలవడం సంచలనం సృష్టించింది. ఆ ప్రచారం ప్రకారం ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయంట. కీర్తి తండ్రి సురేశ్ కేరళలో బీజేపీ నాయకుడు. అందుకే అక్కడ ఒక పేరుపొందిన బీజేపీ నాయకుడి కుమారుడితో పెళ్లి ఖాయం చేశాడంటూ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదనీ, ఇది కేవలం వదంతేననీ కీర్తి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కీర్తి దృష్టంతా తన సినీ కెరీర్పైనే ఉందనీ, తన నటనకు సవాలు విసిరే మంచి పాత్రలు చెయ్యాలని ఆమె ఉవ్విళ్లూరుతోందనీ ఆ వర్గాలు అంటున్నాయి.