నేచురల్ బ్యూటీ!
on Oct 17, 2019
'మహానటి' మూవీతో కీర్తి సురేశ్ కెరీర్ మరో మలుపు తిరిగింది. మహానటి సావిత్రిగా ఆమె చేసిన నటనతో కీర్తి తెలుగు ప్రేక్షకుల హృదయల్లో చెరగని ముద్ర వేసింది. ఆ సినిమా తర్వాత పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న కేరెక్టర్ అంటే డైరెక్టర్లకు కీర్తి గుర్తుకు వస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు పెద్ద హీరోల సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటనకు మంచి అవకాశమున్న విమెన్ సెంట్రిక్ మూవీస్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది కీర్తి. అలాంటి వాటిలో ప్రస్తుతం చేస్తోన్న నగేశ్ కుకునూర్ సినిమా ఒకటి.
హైదరాబాదీ అయిన నగేశ్ 13 సినిమాలు డైరెక్ట్ చేస్తే వాటిలో ఒక్క తెలుగు సినిమా లేదు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఆయన ఇప్పటివరకూ సినిమాలు రూపొందించాడు. తొలిసారి ఆయన తెలుగులో డైరెక్ట్ చెయ్యాలనుకున్నప్పుడు హీరోయిన్ కేరెక్టర్కు ఆయన ఫస్ట్ ఆప్షన్.. కీర్తి. నగేశ్ చెప్పిన స్టోరీ వినగానే ఆమె ఓకే చెప్పేసింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ మూవీలో కీర్తి జోడీగా ఆది పినిశెట్టి నటిస్తుండగా, ఇంకో కీలక పాత్రను వెటరన్ యాక్టర్ జగపతిబాబు చేస్తున్నారు.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాకు, బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను' ఫేం చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. సుధీర్ చంద్ర ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీని దిల్ రాజు ప్రెజెంట్ చేస్తుండటం గమనార్హం. దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ను ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.