అప్పుడు నయనతార ఏడ్చింది, ఇప్పుడు కీర్తి సురేష్
on Mar 22, 2018
తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న నయనతార తమిళ్లో మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ముందు కెళ్తుంది. ప్రమోషన్స్ కోసం పెద్ద ఇంటరెస్ట్ చూపని, నయన్ ఒకానొక సందర్భంలో ఏడ్చేసింది. శ్రీ రామ రాజ్యం సినిమా పై ఎంతో మక్కువ పెంచుకున్న నయన్, ఆ సినిమా షూటింగ్ అయిపోగానే అందరి ముందు కన్నీరు, మున్నీరై ఏడ్చేసింది. ఇక అలాంటి సంఘటనే మళ్లీ పునరావృతమైంది. కానీ, ఈసారి ఎమోషనల్ అయింది కీర్తి సురేష్. సావిత్రి బయోపిక్ మహానటి లో సావిత్రి రోల్ చేస్తున్న కీర్తి తాను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసిందట. ఇక నిన్నటితో షూటింగ్ ముగిసి పోవడంతో సెట్లోనే కన్నీటి పర్యంతమయ్యిందట. ఇక నుండి తాను సాధారణ నటిగా ఉండాల్సి వస్తుందని... సావిత్రి పాత్ర చేయడం తన జీవితంలో దొరికిన గొప్ప వరం గా చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయిందట. కీర్తి మాత్రమే కాదు, యూనిట్ మొత్తం షూటింగ్ ముగిసిపోవడంతో కొంచెం ఎమోషనల్ అయ్యారట. చివరి రోజు షూటింగ్ పురస్కరించుకొని, నిన్న పూలతో సావిత్రి చిత్రపఠానికి నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే, మే 9 న మహానటి ప్రేక్షకుల ముందుకి వస్తున్న విషయం మనకు తెలిసిందే.