కీరవాణి ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్
on Jan 27, 2021
ద్విశతాధిక చిత్రాల స్వరకర్త ఎం. ఎం. కీరవాణి.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న యంగ్ టైగర్ యన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బడా మల్టిస్టారర్ ఆర్ ఆర్ ఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిరియడ్ డ్రామాతో పాటు వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ రూపొందించిన కొండపొలంకి కూడా తనే సంగీత దర్శకుడు. అలాగే.. పెళ్ళి సందడికి నయా వెర్షన్ గా రూపొందుతున్న సినిమాకీ తనే బాణీలు సమకూర్చుతున్నారు.
వీటితో పాటు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి కూడా పనిచేయనున్నారట ఈ వెటరన్ మ్యూజిక్ కంపోజర్. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే... ఓ బాబూ!. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో తనికెళ్ళ భరణి రూపొందించనున్న ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఖరారయ్యారని టాక్. త్వరలోనే ఓ బాబూ!లో కీరవాణి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. దర్శకేంద్రుడి రూపకల్పనలో రూపొందిన పలు చిత్రాలను తన బాణీలతో మ్యూజికల్ సెన్సేషన్స్ గా నిలిపిన కీరవాణి.. ప్రధాన పాత్రధారిగా సదరు దిగ్గజ దర్శకుడు చేస్తున్న ప్రయత్నానికీ ప్లస్ అవుతారేమో చూడాలి.