కీరవాణి కొడుకు హీరోగా మరో సినిమా
on Oct 24, 2020
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక పని చేస్తుంటారు. అయితే... కొన్నాళ్ల క్రితం 'మత్తు వదలరా' సినిమా వచ్చే వరకూ వాళ్లింటి నుండి హీరోగా ఎవరూ లేరు. ఆ లోటును కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా తీర్చాడు.
ఇంటి బిడ్డకు నటన మీద ఆసక్తి ఉందని కీరవాణి ఫ్యామిలీ ఫక్తు హీరోయిజం ఉన్న సినిమాతో పరిచయం చేయలేదు. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయిచారు. 'మత్తు వదలరా' సినిమాకి మంచి పేరు వచ్చింది. అలాగని, వెంటనే శ్రీ సింహా మరో సినిమా చేయలేదు. మంచి కథ కోసం ఎదురు చూశాడు. అటువంటి కథ దొరికిందని సమాచారం.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... శ్రీ సింహ హీరోగా కీరవాణి కుటుంబానికి సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి ఓ సినిమా చేయనున్నారు. 'కలర్ ఫోటో' నిర్మాతలలో ఒకరైన బెన్నీ ముప్పానేనితో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈసారీ కొత్త దర్శకుడు చెప్పిన కథకు కీరవాణి కుటుంబం ఓటు వేసింది. దసరాకి ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
Also Read