కరణ్ జోహార్కి క్లీన్ చిట్
on Oct 27, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత మర్డర్ మిస్టరీగా మొదలైన కేసు, ఆ తరువాత డ్రగ్స్ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కోణం వెలికి తీసే ప్రక్రియలో భాగంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యారు. బెయిల్ మీద విడుదలయ్యారు. ఆ సమయంలో 2019లో ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన పార్టీలోనూ పలువుగు సెలబ్రిటీలు డ్రగ్స్ సేవించారని పుకార్లు షికార్లు చేశారు. అప్పటి పార్టీ మీద విచారణ చేయాలని కోరారు. దానిపై విచారణ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు... కరణ్ జోహార్కి క్లీన్ ఛీట్ ఇచ్చారు.
కరణ్ ఇంట్లో పార్టీ మీద విమర్శలు ఇప్పటివి కావు. ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా నెల క్రితం శిరోమణి అకాళీ దళ్ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా ఆ పార్టీ మీద కంప్లయింట్ చేశారు. ఆ వీడియోలో పేర్కొన్న వైట్ లైన్ మీద ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవనీ, ట్యూబ్ లైట్ను ఉద్దేశించి ‘వైట్ లైన్’ అన్నారని ఎన్సీబీ వర్గాలు తేల్చాయట. కరణ్కి క్లీన్ ఛీట్ ఇచ్చాయట. ఇటీవల కరణ్ జోహార్ కూడా తన ఇంట్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నామనేది అవాస్తవమని వివరణ ఇచ్చారు.
Also Read