ఏప్రిల్ 23న రానున్న 'తలైవి'
on Feb 25, 2021
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత దేశంలోని కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో ఆరాధ్య నాయకిగా నిలిచిపోయారు. ఆ మహానాయకురాలికి అపురూపమైన నివాళి అర్పించేందుకు ఆమె బయోపిక్ 'తలైవి' పేరుతో రూపొందుతోంది. ఆమె స్పూర్తిదాయక జీవిత కథను సెల్యూలాయిడ్పై మలచడంలో 'తలైవి' టీమ్ ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు.
జయలలిత పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషిస్తుండగా, పురచ్చి తలైవర్, మక్కల్ తిలగమ్ ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) క్యారెక్టర్ను అరవింద్ స్వామి చేస్తున్నారు.
ఏప్రిల్ 23న 'తలైవి'ని విడుదల చేస్తున్నట్లు ఓ మోస్టర్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించింది. సినీ తార నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే దాకా సాగిన జయలలిత అద్భుత ప్రయాణాన్ని హైలైట్ చేస్తూ ఈ పోస్టర్ను రూపొందించారు.
తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్న 'తలైవి' చిత్రాన్ని విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలు. సముద్రకని, నాజర్, పూర్ణ, మధుబాల, భాగ్యశ్రీ ఇతర ముఖ్య తారాగణం.