అఫిషియల్: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్!
on Sep 16, 2020
ఇప్పుడు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెంటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. కార్తీ టైటిల్ పాత్రధారిగా అతను డైరెక్ట్ చేసిన 'ఖైదీ' మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్బస్టర్ కావడంతో, విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్తో అతను రూపొందించిన 'మాస్టర్' మూవీ కోసం ఫ్యాన్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యలో తన తదుపరి సినిమా గురించి అఫిషియల్గా ఎనౌన్స్ చేశాడు లోకేష్.
లోకనాయకుడు కమల్ హాసన్తో ఒక పొలిటికల్ మూవీ తీసేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు. 2021లో అది విడుదలవుతుంది. కమల్కు తను బిగ్ ఫ్యాన్ అని గతంలో లోకేష్ వెల్లడించడంతో ఈ వార్త నిజంగా కమల్ ఫ్యాన్స్కు ఉత్తేజాన్నిచ్చేదే. తాత్కాలికంగా ఈ మూవీని 'కమల్హాసన్232గా పిలవనున్నారు. ఏదేమైనా లోకేష్ చేసిన ట్వీట్లోని 'ఎవనేండ్రు నినైదాయ్' అనే హ్యాష్ట్యాగ్.. కమల్ 'విశ్వరూపం' సినిమాలోని లైన్ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానర్థం 'మీరేం అనుకున్నారు' అని. ఒకవేళ టైటిల్ అదేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
బుధవారం సాయంత్రం ఆరు గంటలకు "అందరికీ ధన్యవాదాలు. #కమల్హాసన్232 #మీరేంఅనుకున్నారు @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @RKFI.” అని ట్వీట్ చేశాడు లోకేష్. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ పోస్ట్లో లోకేష్ షేర్ చేసిన పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది. గన్స్తోటే కమల్ రూపాన్ని డిజైన్ చేసిన ఆ పోస్టర్లో Once upon a time there lived a Ghost అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు శంకర్ డైరెక్షన్లో 'భారతీయుడు 2' మూవీ చేస్తున్నారు కమల్. అది 2021లో గ్రాండ్గా రిలీజ్ కానున్నది. అలాగే సొంత సినిమా 'తలైవాన్ ఇరుక్కిరన్' కూడా లైన్లో ఉంది. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.