'భారతీయుడు 2' బాధితులకు కమల్ పరిహారం...
on Aug 7, 2020
కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఇండియన్-2'. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'భారతీయుడు'గా వచ్చిన తమిళ చిత్రం 'ఇండియన్'కి సీక్వెల్. ఈ ఏడాది ఫిబ్రవరి 19న చెన్నై నగర శివార్లలో ఈవీపీ ఫిలింసిటీలో చిత్రీకరణ ప్రదేశంలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న ఘటన గుర్తు ఉండే ఉంటుంది. ఆ బాధిత కుటుంబాలకు గురువారం కమల్ హాసన్ పరిహారం అందజేశారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు కోటి చొప్పున, గాయపడిన వ్యక్తుల కుటుంబాలు అందరికీ కోటి రూపాయలు చెక్కులు ఇచ్చారు.
'ఇండియన్ 2' సెట్స్లో అనూహ్యంగా భారీ క్రేన్ కూలడంతో సహాయ దర్శకుడు శ్రీకృష్ణ, సహాయ కల దర్శకుడు మధు, ప్రొడక్షన్ సహాయకుడు చంద్రన్ మృతి చెందారు. కొందరికి గాయాలు అయ్యాయి. దర్శకుడు శంకర్ సహా కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రమాదం చోటు చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు ఆ ప్రదేశం నుండి వెళ్లడంతో క్షేమంగా బయటపడ్డారు.