తాత, బాబాయ్, తమ్ముడు బాటలో..
on Jan 18, 2021
కుల గౌరవం, దాన వీర శూర కర్ణ చిత్రాల్లో మహానటుడు నందమూరి తారక రామారావు.. అధినాయకుడులో నటసింహ బాలకృష్ణ.. జై లవ కుశ చిత్రంలో యంగ్ టైగర్ యన్టీఆర్.. త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు ఇలా త్రిపాత్రాభినయం చేయడం అరుదనే చెప్పాలి. అలా.. త్రిపాత్రల పరంగా నందమూరి కుటుంబంలో ఓ రేర్ రికార్డ్ ఉందనే చెప్పాలి.
కట్ చేస్తే.. ఇప్పుడదే కుటుంబానికి చెందిన మరో మూడో తరం హీరో త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. ఆ కథానాయకుడు మరెవరో కాదు.. కళ్యాణ్ రామ్. ఆ వివరాల్లోకి వెళితే.. నూతన దర్శకుడు రాజేంద్ర కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్ ఓ బ్రీజీ ఎంటర్ టైనర్ చేయబోతున్నారని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కళ్యాణ్.. త్రిపుల్ రోల్ లో దర్శనమిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ.. వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మరి.. తాత, బాబాయ్, తమ్ముడు బాటలోనే వెళ్ళనున్న కళ్యాణ్ రామ్.. వారిలాగే త్రిపుల్ రోల్స్ లో ఎంటర్ టైన్ చేస్తారేమో చూడాలి.