నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న కాజల్
on Oct 29, 2016
పారితోషికం విషయంలో కథానాయికలు చాలా చాలా కటువుగా ప్రవర్తిస్తుంటారు. పైకి సున్నితంగా అమాయకంగా అందంగా కనిపించే కథానాయికలు... పైసల దగ్గర పేచీ పెట్టడం మామూలే. ఈ విషయంలో కాజల్ కూడా మహా మొండి. ఇటీవల ఓ సినిమా ఆడియో ఫంక్షన్కి రావడానికి నిర్మాతల దగ్గర నుంచి రూ.5 లక్షలు గుంజిందట. అదీ.. తాను నటించన సినిమాదే కావడం విశేషం. కాజల్, జీవా జంటగా నటించిన సినిమా ఎంత వరకూ ఈ ప్రేమ విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఇటీవలే హైదరాబాద్లో జరిగింది. ఈ పోగ్రాంకి రావడానికి నిర్మాత నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసిందట. అడిగినంత ఇస్తేనే గానీ ఫంక్షన్కి వచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేసిందట కాజల్. నిజానికి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం గంట కేటాయిస్తానని ముందే ఎగ్రిమెంట్పై సంతకాలు చేసిందట. అయితే చివరి నిమిషంలో `నాకు డేట్లు ఖాళీ లేవు.. డబ్బులిస్తేనే వస్తా` అంటూ తిరకాసు పెట్టిందట. దాంతో నిర్మాతలు రూ.5 లక్షలు చదివించుకోవాల్సివచ్చింది. నిర్మాతల్ని మరీ ఇంత హింసించడమా? దారుణం కదూ...