బాలకృష్ణ ఏమంటారో?
on Oct 27, 2018
బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటయ్యారు. ఒకప్పుడు ఉప్పు-నిప్పు అన్నట్టున్న వీరిద్దరూ 'అరవింద సమేత వీరరాఘవ' విజయోత్సవంలో పాలు-పంచదార అన్నట్టు కలిసి కనిపించారు. హరికృష్ణ మరణానంతరం బాబాయ్ అబ్బాయ్ మధ్య సంబంధాలు మెరుగయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అబ్బాయ్ గురించి 'అరవింద..' విజయోత్సవంలో బాబాయ్ మాట్లాడినది ఒక్క మాటే అయినా బాగా మాట్లాడారు. అబ్బాయ్ మీద ప్రేమాభిమానాలు మీడియా ముందు మాత్రమేనా? నిజంగా వున్నాయా? అనేది 'ఎన్టీఆర్' బయోపిక్ వాయిస్ ఓవర్ విషయంలో స్పష్టత వచ్చేస్తుందేమో!
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న బయోపిక్ 'యన్.టి.ఆర్'. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ బయోపిక్ రెండు భాగాలుగా ('ఎన్టీఆర్ - కథానాయకుడు', 'ఎన్టీఆర్ - మహానాయకుడు') ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండిటికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే బావుంటుందని దర్శకుడు క్రిష్ భావన. కొన్ని రోజుల నుంచి ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఇటీవల బాలకృష్ణ ముందు యంగ్ టైగర్ వాయిస్ ఓవర్ ఇస్తే బావుంటుందనే ప్రతిపాదనను క్రిష్ పెట్టారట. ఆయన ఏమంటారో? అని క్రిష్, ఇతర యూనిట్ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు బాల్ బాలకృష్ణ కోర్టులో వుంది. అబ్బాయ్ వాయిస్ ఓవర్ ఇస్తే బాబాయ్ సరే అంటారా? వెయిట్ అండ్ సి!!