మహేశ్ బాటలో తారక్!
on Mar 22, 2020
ఘట్టమనేని మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్.. షార్ట్లో చెప్పాలంటే జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. ఇది సూపర్ స్టార్ మహేశ్ సొంత నిర్మాణ సంస్థ. శ్రీమంతుడు సినిమాతో ఈ బ్యానర్ మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. లేటెస్ట్గా అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న మేజర్ సినిమాని మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మిస్తోంది. రానున్న రోజుల్లో తను హీరోగా నటించే సినిమాలకు ఒక భాగస్వామిగా వ్యవహరించాలని మహేశ్ నిర్ణయించుకున్నాడు.
ఇప్పుడు మహేశ్ బాటలో నడవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి, భవిష్యత్తులో తను నటించే సినిమాలకు రెమ్యూనరేషన్ బదులు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ, బిజినెస్లో షేర్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు, ఇతర హీరోలతో సినిమాలు నిర్మించాలని కూడా అతని ఆలోచనగా చెబుతున్నారు. సొంత బ్యానర్కు తండ్రి నందమూరి హరికృష్ణ పేరు పెట్టనున్నట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
నిజానికి అతని సోదరుడు కల్యాణ్రామ్కు నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పేరిట సొంత బేనర్ ఉంది. ఆ బేనర్ కిందే తారక్ జై లవ కుశ సినిమా చేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్న సినిమాకి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్తో పాటు యన్.టి.ఆర్. ఆర్ట్స్ బేనర్ కూడా భాగస్వామిగా వ్యవహరించనున్నది. ఈ నేపథ్యంలో తండ్రి పేరిట సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాలని తారక్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం.
Also Read