డబ్బుల కోసం ఎన్టీఆర్ని పక్కన పెట్టాడు
on Nov 2, 2016
ఎన్టీఆర్తో ఇప్పుడు సినిమా అంటే.. దర్శకులంతా గంతులు వేయాల్సిందే. ఎందుకంటే వరుసగా మూడు హిట్లతో సూపర్ ఫామ్లోకి వచ్చేశాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంద కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ రేంజుని పెంచేసింది. ఎన్టీఆర్ నుంచి ఫోన్ కాల్ వస్తే బాగుణ్ణు అని చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశం సురేందర్ రెడ్డికి కూడా వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు ఊసరవెల్లి సినిమా వచ్చింది. టెక్నికల్ గా ఆ సినిమా బాగానే ఉన్నా.. సరిగా ఆడలేదు. సూరి టాలెంట్పై నమ్మకం ఉంచిన ఎన్టీఆర్.. తనని పిలిపించాడని టాక్.
అయితే సురేందర్ రెడ్డి మాత్రం `నాకిప్పుడు ఖాళీ లేదు` అనేశాడట. దాంతో ఎన్టీఆర్ షాకయ్యాడని సమాచారం. సురేందర్ రెడ్డి ఇంత మంచి ఆఫర్ వదులుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ రెండో సినిమా చేసే ఆఫర్ సురేందర్ రెడ్డికి వచ్చిందని టాక్. ఆసినిమా కోసం ఏకంగా రూ.12 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఎన్టీఆర్ తో సినిమా చేస్తే తన పారితోసికం రూ.5 కోట్లకు మించకపోవొచ్చు. దాని కంటే ఇక్కడ రూ.7 కోట్లు ఎక్కువ వస్తున్నాయి. అందుకే.. సురేందర్ రెడ్డి నిఖిల్ గౌడ సినిమాకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంటే కోట్ల కోసం ఎన్టీఆర్ని వదులుకొంటున్నాడన్నమాట. మరి ఈ నిర్ణయం సురేందర్రెడ్డి కెరీర్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాల్సిందే.