ఆరో తారీఖు ఆరు గంటలకి!
on Jul 5, 2016
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా "జనతా గ్యారేజ్"పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొన్నాడు. రేపు ఈ చిత్రం టీజర్ ను విడుదల చేస్తున్నారు. జూలై 6వ తారీఖున, సాయంత్రం 6.00 గంటలకి "జనతా గ్యారేజ్" టీజర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేయనున్నారు. ఎన్టీయార్ సరసన సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరసారధ్యం వహిస్తుండగా.. జూలై 22న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను హైద్రాబాద్, శిల్పకళా వేదికలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు!