బాలయ్య, గోపీచంద్.. సీమ బ్యాక్ డ్రాప్
on Feb 25, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణకి రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు భలేగా కలిసొచ్చాయి. `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. కట్ చేస్తే.. స్వల్వ విరామం తరువాత మరోమారు బాలయ్య సీమ బ్యాక్ డ్రాప్ తో పలకరించబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్న సంగతి తెలిసింది. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. అంతేకాదు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుందట. అదేవిధంగా.. `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` తరహాలో ఫ్యాక్షన్ టచ్ కూడా ఉంటుందని టాక్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, బాలయ్య ప్రస్తుతం మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా.. మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.