గ్లామర్ డోస్ పెంచింది.. నేషనల్ క్రష్ అయ్యింది!
on Nov 23, 2020
టాలీవుడ్లో అతి స్వల్ప కాలంలోనే టాప్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తున్న సంచలన తార రష్మిక మందన్నను ఇటీవల 2020 సంవత్సరానికి నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గూగుల్ గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి దాకా నార్త్లో ఒక్క సినిమా చేయకపోయినా సౌత్తో పాటు అక్కడ కూడా మాస్ పాపులారిటీని సొంతం చేసుకుంది రష్మిక. టాలీవుడ్లో ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో ఆడియెన్స్ను మెస్మరైజ్ చేసి, అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కర్ణాటక అమ్మాయి అయిన ఆమె కన్నడంలో 'కిరిక్ పార్టీ'లో హీరోయిన్గా నటించడం ద్వారా గ్లామర్ వరల్డ్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా హిట్టవడంతో అక్కడ ఓవర్నైట్ స్టార్ అయ్యింది. అయితే ఆమె కెరీర్ దిశను మార్చిన సినిమా టాలీవుడ్లో చేసిన 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ జోడీగా ఆ సినిమాలో ఆమె ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకులు, విమర్శకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన 'పుష్ప' మూవీలో నాయికగా నటిస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న 'పుష్ప' పాన్ ఇండియా మూవీగా తయారవుతోంది. 2020కి ఆమె నేషనల్ క్రష్ ఎందుకయ్యిందో ఇన్స్టాగ్రామ్లో ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలే నిదర్శనం...
Also Read