హృతిక్ రోషన్ తల్లికి కరోనా!
on Oct 22, 2020
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ తాను కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డాననీ, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాననీ ధ్రువీకరించారు. అయితే తనలో ఆ లక్షణాలేమీ కనిపించలేదన్నారు. లాక్డౌన్ పీరియడ్లో రోషన్ కుటుంబం అంతా ఒక్కచోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో ఉంటోంది. రాకేష్ రోషన్, పింకీ దంపతులు తమ ఖండాలా ఫామ్హౌస్లో ఉంటే, జుహులోని తన పేరెంట్స్ ఇంటికి దగ్గరగా బీచ్ సమీపంలో ఉన్న తన ఫ్లాట్కు వెళ్లాడు. ఇక సుజానే ఖాన్ వెర్సోవాలో ఉన్న తన ఫ్లాట్కు పిల్లలు హ్రెహాన్, హ్రెదాన్లను తీసుకొని వెళ్లిపోయింది.
కరోనా మహమ్మారి కాలంలో ముందు జాగ్రత్తగా ప్రతి 20 రోజులకోసారి తాము పరీక్షలు చేయించుకుంటున్నామనీ, ఇందులో తమ మొత్తం కుటుంబ సభ్యులతో పాటు, స్టాఫ్కూడా ఉంటున్నారనీ పింకీ తెలిపారు. "పదిహేను రోజుల క్రితం వైరస్ నాలోకి ప్రవేశించింది. అయినా నాలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. నేను యోగా, ఎక్సర్సైజ్లు చేస్తాను కాబట్టి ఆ వైరస్ కంట్రోల్లో ఉందని డాక్టర్లు తెలిపారు. రేపు మరోసారి టెస్ట్ చేయించుకోబోతున్నా. ఈసారి నెగటివ్ వస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పారు పింకీ. తనతో పాటు తన తల్లి, కూతురు సునయన, మనవరాలు సునారిక కూడా ఉంటున్నారని ఆమె వెల్లడించారు. సందర్భవశాత్తూ గురువారం ఆమె బర్త్డే కావడం గమనార్హం.
Also Read