నితిన్ `గుండెజారి గల్లంతయ్యిందే`కి 8 ఏళ్ళు
on Apr 19, 2021
రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యువ కథానాయకుల్లో నితిన్ ఒకరు. అలాంటి.. నితిన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `గుండెజారి గల్లంతయ్యిందే` ఒకటి. `ఇష్క్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కేరళకుట్టి నిత్యా మీనన్ తో నితిన్ జట్టుకట్టిన ఈ సినిమా కూడా హిట్టు బాట పట్టింది. విజయ్ కుమార్ కొండా దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో ఇషా తల్వార్ మరో నాయికగా నటించగా.. అలీ, మధునందన్, ఆహుతి ప్రసాద్, సుధ, రఘుబాబు, తాగుబోతు రమేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాల గుత్తా ప్రత్యేక గీతంలో మెరిసింది.
అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ యువతరాన్ని అలరించాయి. మరీముఖ్యంగా.. టైటిల్ సాంగ్ సినిమాకి ఓ హైలైట్ గా నిలవగా, పవన్ కళ్యాణ్ `తొలిప్రేమ`లోని ``ఏమైందో ఏమో ఈ వేళ`` పాట తాలూకు రీమిక్స్ కూడా మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాతో `ఉత్తమ నటి`గా నిత్యా మీనన్ `ఫిల్మ్ ఫేర్` అవార్డ్ అందుకోవడం విశేషం. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి, విక్రమ్ గౌడ్ నిర్మించిన `ఇష్క్` 2013 ఏప్రిల్ 19న విడుదలైంది. నేటితో ఈ సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. 8 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read