అరుదైన గౌరవం అందుకున్న- రాజమౌళి !!!
on Feb 16, 2019
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో నే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ను, ఇటు టాలీవుడ్ పరిశ్రమలో తనకు అంటూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి ద బిగినింగ్ , బాహుబలి ద కంక్లూజన్ అంటూ రెండు భాగాలుగా తీసిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. ఇక సినిమాకు గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.ఇప్పుడు తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ `గోదావరి` రాజమౌళికి హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్పరెన్స్- 2019 కు హాజరు కావాల్సిందిగా స్వాగతం పలికింది. మరి గతంలో ఈ ప్రతిష్టాత్మక సదస్సు కు భారతదేశానికి చెందిన ప్రముఖలు కమల్ హాసన్, షారుక్ ఖాన్, పవన్ కళ్యాణ్ సహా మరెందరో ప్రముఖులను స్వాగతించగా ఇప్పుడు రాజమౌళిని ఆహ్వానించడం గోప్ప విషయమే.