గాలి పెళ్లితో చిక్కుల్లో రకుల్ ..?
on Nov 22, 2016
దేశం మొత్తం జిగేల్ జిగేల్ మనేటట్లు కూతురి పెళ్లి చేశాడు కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి. ఈ వివాహానికి దేశంలో పేరుమోసిన సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడికి వెళితే తమకు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో చాలా మంది వీఐపీలు ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు. ఆ సంగతి పక్కన బెడితే మొదటి నుంచి ఈ వివాహంపై కన్నేసిన ఐటీ శాఖ అందరూ అనుకున్నట్లుగానే తన పంజా విసిరింది. గాలి నివాసంపైనా, కార్యాలయాలపైనా దాడులు నిర్వహించింది. దీనిపై దర్యాప్తు చేస్తూనే మరోవైపు ఈ పెళ్లిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసిన సెలబ్రిటీలపైనా గురిపెట్టింది.
ఈ నేపథ్య్త్తంలో హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్కు ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసిందని ఫిల్మ్నగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే గాలిపెళ్లిలో రకుల్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసి అతిథులకు కనువిందు చేసింది. అందుకు గానూ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుందని తెలుస్తోంది. అందుకే రకుల్ ఐటీ నోటీసులు అందుకుందని వదంతులు రేగాయి. అయితే ఈ పుకార్లు నిరాధారమని, రకుల్ అలాంటి నోటీసులేవీ అందుకోలేదని ఆమె సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.