శ్రీసుధ సంతకాన్ని ఫోర్జరీ చేసిన శ్యామ్ కె నాయుడు?
on Jun 30, 2020
నటి శ్రీసుధ అలియాస్ సాయిసుధ, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు మధ్య వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. శ్యామ్ కె. నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ శ్రీసుధ పెట్టిన కేసులో బెయిల్ కోసం యత్నించిన నాయుడుపై అదనంగా ఫోర్జరీ కేసు తోడయ్యింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో శ్యామ్ కె. నాయుడుపై శ్రీసుధ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నాయుడును అరెస్ట్ చేశారు. అయితే జామీనుపై బయటకు వచ్చిన నాయుడు తమ ఇద్దరికీ తెలిసినవాళ్ల ద్వారా శ్రీసుధతో రాజీ కోసం ప్రయత్నించాడు. ఒక ప్రముఖ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి ఆ ఇద్దరి మధ్యా సర్దుబాటు చేసినట్లు తెలిసింది.
మరోవైపు పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. నాంపల్లి కోర్టుకు ఈ కేసును నివేదించారు. విచారణ సందర్భంగా తమ మధ్య రాజీ కుదిరిందంటూ శ్రీసుధ సంతకం చేసిన రాజీ పత్రాన్ని కోర్టుకు సమర్పించాడు నాయుడు. అయితే అది తన సంతకం కాదనీ, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారనీ శ్రీసుధ కోర్టుకు తెలిపారు.
దీంతో శ్యామ్ కె. నాయుడు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు, అతనిపై ఫోర్జరీ కేసుతో పాటు మరో కేసును కూడా దాఖలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఫలితంగా నాయుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. చివరకు ఈ కేసు ఏమవుతుందో చూడాలి.