నాగచైతన్యపై మండిపడుతున్న అభిమానులు.. ఎందుకో తెలుసా?
on Mar 8, 2021
అక్కినేని అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో వారు నాగచైతన్యపై విరుచుకుపడుతున్నారు. కొంతమంది అభిమానులైతే ఆ సినిమాను తాము చూడమని తెగేసి చెబుతున్నారు. కారణం.. 'థ్యాంక్ యూ' సినిమాలో అతను చేస్తున్న పాత్ర. అందులో సూపర్స్టార్ మహేశ్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా అతను కనిపించనున్నాడు. ఈ విషయం ఇదివరకే లీక్ అయ్యింది. మహేశ్ కటౌట్ను నాగచైతన్య నిలబెట్టే సన్నివేశాలను డైరెక్టర్ విక్రమ్ కుమార్ తీస్తున్నప్పుడు సోషల్ మీడియాలో అది లీక్ అయ్యింది. అప్పుడే నాగచైతన్య క్యారెక్టర్ ఏమిటనేది అతని ఫ్యాన్స్కు తెలిసింది.
లేటెస్ట్గా 'థ్యాంక్ యూ' మూవీ షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. ఇప్పుడు కూడా అవే తరహా సీన్లు తీస్తున్నారు. ఇదే ఫ్యాన్స్ను బాధపెడుతోంది. మహేశ్ కటౌట్పై నిల్చొని పాలాభిషేకం చేయడానికి రెడీగా ఉన్న చైతూ సీన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. అది 'ఒక్కడు' సినిమాకు సంబంధించిన కటౌట్. అంటే 2003 బ్యాక్డ్రాప్ సీన్లను డైరెక్టర్ తీస్తున్నాడన్న మాట. ఈ సీన్లలో చైతూ బాగా కుర్రాడిలా కనిపిస్తున్నాడు.
తమ అభిమాన హీరో మరో కాంటెంపరరీ హీరో ఫ్యాన్గా నటిస్తుండటం, అతని కటౌట్కు పాలాభిషేకం చేస్తుండటం చూసి అక్కినేని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. తండ్రి నాగార్జున అభిమానిగానో, మామయ్య వెంకటేశ్ అభిమానిగానో నటించొచ్చు కదా, మహేశ్ ఫ్యాన్గానే ఎందుకు నటించాలని కొంతమంది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చైతూ ఇలా చేయడం వల్ల అతని స్టార్డమ్ తగ్గిపోయినట్లువుతుందని వారు ఫీలవుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలు అలా నటిస్తే అర్థముంది కానీ, టాలీవుడ్లోని ప్రతిష్ఠాత్మక కుటుంబాల్లో ఒకటైన అక్కినేని వంశ వారసుడు ఇలా చేయడం బాగాలేదని వారంటున్నారు. అందుకే 'థ్యాంక్ యూ' సినిమాని తాము చూడమని తేల్చి చెబుతున్నారు. మరి చైతూ ఏం చేస్తాడో చూడాలి. థ్యాంక్ యూ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Also Read