'రాగల 24 గంటల్లో' స్టోరీ నా భుజాల మీద నడుస్తుంది: ఈషా రెబ్బా
on Nov 7, 2019
శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన 'రాగల 24 గంటల్లో' మూవీలో హీరోయిన్గా చేసింది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో తమిళ హీరో శ్రీరాం పోలీస్ ఆఫీసర్ కేరెక్టర్ చేశారు. నవంబర్ 15న ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'తెలుగుఒన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ తన భుజల మీద నడుస్తుందని ఈషా చెప్పారు.
"స్టోరీ విన్నప్పుడు ఎంగేజింగ్గా అనిపించింది. పైగా విమన్ సెంట్రిక్ స్టోరీ. సాధారణంగా తారలకు ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఈ సినిమా నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రైతి ఒక్కరూ ఈ మూవీని ఇష్టపడతారని ఆశిస్తున్నా. కథ వింటుంటే తర్వాత సీన్లో ఏం జరుగుతుందనేది ఊహించలేకపోయాను. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఇంతవరకు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ చెయ్యలేదు. డైరెక్టర్ అంటే అన్ని రకాల జానర్స్ చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ టైం ఈ జానర్ చేశారు. దానికి ఆయన 100 శాతం న్యాయం చేశారు. ఈ మూవీ మొత్తం నా భుజాల మీద ఉంటుంది. షూటింగ్ చేసేప్పుడు నాకు మానసికంగా, శారీరకంగా స్ట్రైన్ అనిపించేది. షూటింగ్ నాన్-స్టాప్ చేశాం. ఒక్కో రోజు 12 గంటలు, ఆ పైన కూడా పనిచేశాం. శ్రీనివాసరెడ్డిగారు ప్రోత్సాహం, సపోర్టుతో ఈ సినిమా బాగా చేయగలిగాను.
ఈ సినిమాలో ప్రతి కేరెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ప్రయోజనం ఉంది. సత్యదేవ్, కృష్ణభగవాన్ గారి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్తో పనిచెయ్యడం నాకొక కొత్త ఎక్స్పీరియెన్స్లా అనిపించింది. నేను ఇదివరకు 'సుబ్రమణ్యపురం' అనే మైథలాజికల్ థ్రిల్లర్ చేశాను. కంటెంట్ పరంగా ఆ సినిమాకూ, 'రాగల 24 గంటల్లో' సినిమాకూ సంబంధం లేదు. 'సుబ్రమణ్యపురం' కథ దేవుడి చుట్టూ నడుస్తుంది. ఇది ఒక నార్మల్ అమ్మాయి, ఒక నార్మల్ అబ్బాయి మధ్య నడిచే కథ. సడన్గా ఆ అమ్మాయికి రియాలిటీ ఏమిటనేది తెలుస్తుంది. ఆ పరిస్థితిని ఆమె ఎలా ఫేస్ చేసిందనేది థ్రిల్లింగ్గా ఉంటుంది. టైటిల్కు తగ్గట్లే రాబోయే 24 గంటల్లో ఏం జరుగుతుందనేదే ఈ సినిమాలో కీలక పాయింట్" అని చెప్పారు ఈషా.
Also Read