8 గంటల పాటు సుశాంత్సింగ్ ప్రేయసిని ప్రశ్నించిన ఈడీ
on Aug 8, 2020
బాలీవుడ్ యాక్టర్ దివంగత సుశాంత్సింగ్ రాజ్పుత్ గాళ్ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏకంగా ఎనిమిది గంటల పైగా ప్రశ్నించింది. శుక్రవారం రాత్రి 8:35 నిమిషాలకు ఆమె ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. ఆమెకు తోడుగా తండ్రి, సోదరుడు ఉన్నారు.
తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం వెనుక రియా, ఆమె సన్నిహితులు ఉన్నారంటూ సుశాంత్సింగ్ తండ్రి కె.కె. సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి అనుగుణంగా సుశాంత్సింగ్ మృతి కేసులో మానీ-లాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అందులో భాగంగా రియాను ప్రశ్నించింది.
తన కుమారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి రియా, ఆమె కుటుంబ సభ్యులు రూ. 15 కోట్లను విత్డ్రా చేశారనీ, తన కుమారుడిని వేధించి, ఆత్మహత్య చేసుకొనేందుకు కారణమయ్యారంటూ పాట్నాలోని రాజీవ్నగర్ పోలీస్ స్టేషన్లో కె.కె. సింగ్ కేసు పెట్టారు. ఆ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది.
అందిన సమాచారం ప్రకారం ఈడీ అధికారులకు రియా సరిగా సహకరించలేదనీ, విచారణ జరిగినంత సేపూ ఎక్కువగా నాకు గుర్తులేదు, నాకు సరిగా తెలీదు అని సమాధానాలు ఇచ్చిందనీ తెలుస్తోంది. రియా కంటే ముందు ఆమె మేనేజర్ శ్రుతి మోడీని ఈడీ అధికారులు ఇంటరాగేట్ చేశారు.
Also Read