అభిషేక్కి కరోనా.. బాలీవుడ్కి లాస్!
on Jul 13, 2020
అభిషేక్ బచ్చన్కి కరోనా వచ్చింది. ముంబైలో ఓ డబ్బింగ్ స్టూడియో మూతపడింది. మరికొన్ని షోస్, షూటింగ్స్ ఆగాయి. డబ్బింగ్స్ నిలిచిపోయాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ లాస్ (కరోనా తరవాత బిజినెస్ లెక్కలోకి తీసుకుంటే లాస్ ఎక్కువే) ఏర్పడింది. అభిషేక్కి కరోనా వస్తే డబ్బింగ్ స్టూడియో ఎందుకు మూత పడింది? బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన నష్టమేమిటి? ఎందుకు మూతపడింది? అంటే... అసలు మేటర్ చదవాల్సిందే.
రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో 'బ్రీత్: ఇన్టు ద షాడోస్' వెబ్ సిరీస్ రిలీజయింది. అందులో అభిషేక్ బచ్చన్ నటించారు. రిలీజ్కి ముందు ఆయన డబ్బింగ్ చెప్పడానికి ముంబైలోని 'సౌండ్ అండ్ విజన్' స్టూడియోకి వెళ్లారు. అది ఫేమస్ స్టూడియో. అమెజాన్ షో కోసం డైలీ బేసిస్ మీద రెంట్ కి తీసుకున్నారు. ఇప్పుడు అభిషేక్ కరోనా బారిన పడ్డారు. స్టూడియోకి వచ్చి వెళ్లారు కనుక కొన్ని రోజులు దాన్ని మూసి వేయాలని డెసిషన్ తీసుకున్నారు. అక్కడ జరగాల్సిన డబ్బింగ్ వర్క్స్ పోస్ట్ పోన్ చేశారు. అంతే కాదు.. దాంతో నష్టాలు తప్పడం లేదు. అదీ సంగతి!