కొత్త ట్విస్ట్: సారీ రకుల్.. సారీ సారా..!
on Sep 14, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మర్డర్ మిస్టరీలో కొత్త ట్విస్ట్... డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి విచారణలో పలువురి పేర్లు వెల్లడించినట్లు జాతీయ మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. హిందీ చలన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ తీసుకుంటున్న 25 మంది పేర్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి చెప్పిందని కథలు కథలుగా చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సైఫ్ అలీఖాన్ కూతురు యంగ్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ స్నేహితురాలు సైమన్ ఖంబట్టా తనతో పాటు పార్టీల్లో డ్రగ్స్ తీసుకున్నారని నేషనల్ న్యూస్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. ఈ కథనాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ కె.పి.ఎస్. మల్హోత్రా ఖండించారు. తాము లిస్ట్ ఏది ప్రిపేర్ చేయలేదని చెప్పారు. డ్రగ్ ట్రాఫికర్స్, పెడ్లర్స్ మీద దృష్టి సారించినట్లు తెలిపారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరి పేర్లను లిస్టులోకి తీసుకోలేదన్నారు.
కె.పి.ఎస్. మల్హోత్రా స్టేట్మెంట్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో రకుల్, సారాకి సారీ చెబుతూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ లో నిలిచాయి. #SorryRakul #SorrySara #NoRakul #NoSara హ్యాష్ ట్యాగ్లతో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
Also Read