సుశాంత్ కేసు... ఎన్సీబీ టీమ్లో ఒకరికి కరోనా!
on Sep 16, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసులో డ్రగ్ కోణం, లింకులపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈ కేసు మీద పని చేస్తున్న ఎన్సీబీ స్పెషల్ టీమ్లో ఒకరికి కరోనా సోకడంతో విచారణకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతీ మోడీకి ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రమ్మని ఆదేశించింది. సౌత్ ముంబైలో ఎన్సీబీ ఆఫీసుకు ఆమె వచ్చారు. అయితే, ఓ గంటలో వెనక్కి వెళ్లిపోయారు. అందుకు కారణం ఇంటరాగేషన్ చేసే సిట్ టీమ్లో ఒకరు కొవిడ్19 పాజిటివ్గా నిర్థారణ కావడమే. ఎన్సీబీ ఓ స్టేట్మెంట్లో ఈ విషయాన్ని ధృవీకరిచింది.
‘‘మా సిట్ బృందంలో ఒకరు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యారు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రొటోకాల్ ప్రకారం బృందంలో మిగతా సభ్యులకు టెస్ట్ చేయబడతాయి. అందుకని, శ్రుతీ మోడీని వెనక్కి పంపించాం’’ అని ఎన్సీబీ పేర్కొంది. జయ సాహా అని మరొకరికి కూడా సమన్లు జారీ చేశారు. బుధవారం విచారణ చేయాల్సి ఉంది. అయితే, కరోనా దృష్ట్యా అసలు పిలిపించలేదు. శ్రుతీ మోడీ, జయ సాహా... ఇద్దరినీ సీబీఐ కూడా పలుమార్లు ఇంటరాగేషన్ చేసింది.