సీరియస్: హైదరాబాద్ ఆస్పత్రిలో హిందీ దర్శకుడు
on Aug 12, 2020
హిందీ చలనచిత్ర పరిశ్రమ మరో విషాద వార్త వినాల్సి వస్తుందా? ఏమో!? ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేని పరిస్థితి. దర్శకుడు నిషికాంత్ కామత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. లివర్ సంబంధిత సమస్యలతో నిషికాంత్ గతంలో చికిత్స తీసుకున్నారు. మళ్లీ అనారోగ్య సమస్యలకు అదే కారణమా? మరొకటా? అనేది తెలియాల్సి ఉంది.
అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించిన 'దృశ్యం' చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అంతకు ముందు 'మాదారి', 'ముంబై మేరీ జాన్' చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. కొన్ని మరాఠీ చిత్రాలలోనూ ఆయన నటించారు. జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించిన 'రాకీ హ్యాండ్సమ్' చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. 2005లో మరాఠీ చిత్రం 'డోంబివాలి ఫాస్ట్'తో నిషికాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.