శాండల్వుడ్లోనూ 'దృశ్యం 2'
on Apr 15, 2021
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ 'దృశ్యం' (2013).. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చైనా ఇలా పలు భాషల్లో రీమేక్ అయింది. అన్ని చోట్ల ఆదరణకు నోచుకుంది. కట్ చేస్తే.. మలయాళం ఇండస్ట్రీ హిట్ 'దృశ్యం'కి సీక్వెల్ గా 'దృశ్యం 2' రూపొందించి ఈసారి ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు మోహన్ లాల్ - దర్శకుడు జీతూ జోసెఫ్. ఇప్పుడీ కొనసాగింపు చిత్రం కూడా ఆయా భాషల్లో రీమేక్ అయ్యే దిశగా ప్లాన్ జరుగుతోంది.
ఇప్పటికే తెలుగులో విక్టరీ వెంకటేశ్ తో మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్.. ఈ సీక్వెల్ ని రీమేక్ చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ లేదా జూలైలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. కన్నడలోనూ ఈ సీక్వెల్ ని పట్టాలెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి భాగం 'దృశ్య'లో నటించిన రవిచంద్రన్, నవ్యా నాయర్, ఆశా శరత్, ప్రభు.. సీక్వెల్ అయిన 'దృశ్య 2'లోనూ నటించబోతున్నారు.
అంతేకాదు.. 'దృశ్య'ని తెరకెక్కించిన పి. వాసునే 'దృశ్య 2'కి కూడా మెగాఫోన్ పట్టనున్నారు. త్వరలోనే 'దృశ్యం 2' కన్నడ వెర్షన్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read